Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

9వ అధ్యాయము

1  సౌలు ఇంక ప్రభువుయొక్క శిష్యులను బెదరించుటయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకునియొద్దకు వెళ్లి 
2  యీ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనినయెడల వారిని బంధించి యెరూషలేముకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజములవారికి పత్రికలిమ్మని అడిగెను. 
3  అతడు ప్రయాణముచేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను. 
4  అప్పుడతడు నేలపడి -సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక శబ్దము పలుకుట వినెను. 
5  - ప్రభువా, నీ వెవడవని అతడడుగగా ఆయన -నేను నీవు హింసించుచున్న యేసును; 
6  లేచి పట్టణములోకి వెళ్లుము, అక్కడ నీవు యేమిచేయవలెనో అదినీకు తెలుపబడునని చెప్పెను. 
7  అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని యెవనిని చూడక మౌనులై నిలువబడిరి. 
8  సౌలు నేలమీదనుండి లేచి కన్నులు తెరచినను ఏమియు చూడలేకపోయెను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోకి నడిపించిరి. 
9  అతడు మూడు దినములు దృష్టిలేనివాడై అన్నపానములేమియు పుచ్చుకొనకుండెను. 
10  దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు - అననీయా, అని అతని పిలువగా 
11  అతడు - ప్రభువా, యిదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు - నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థనచేయుచున్నాడు. 
12  అతడు అననీయ అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి, తాను దృష్టిపొందునట్లు తనమీద చేతులుంచుట చూచియున్నాడని చెప్పెను. 
13  అందుకు అననీయ - ప్రభువా, యీ మనుష్యుడు యెరూషలోములో నీ పరిశుద్ధులకు ఎంతోకీడు చేసియున్నాడని అతనిగూర్చి అనేకులవలన వింటిని. 
14  ఇక్కడను నీ నామమునుబట్టి ప్రార్థనచేయువారినందరిని బంధించుటకు అతడు ప్రధానయాజకులవలన అధికారము పొందియున్నాడని ఉత్తరమిచ్చెను. 
15  అందుకు ప్రభువు - నీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమైయున్నాడు. 3
16  ఇతడు నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. 
17  అననీయ వెళ్లి ఆ యింట ప్రవేశించి అతనిమీద చేతులుంచి - సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు దృష్టిపొంది పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. 
18  అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టి కలిగి, లేచి బాప్తిస్మము పొందెను; తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. 
19  పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతోకూడ కొన్నిదినములుండెను. 
20  వెంటనే సమాజమందిరములలో - యేసే దేవుని కుమారుడని ఆయననుగూర్చి ప్రకటించుచు వచ్చెను. 
21  వినినవారిందరు విభ్రాంతినొంది, యెరూషలేములో ఈ నామమునుబట్టి ప్రార్థనచేయువారిని నాశనము చేసినవాడితడే కాడా? వారిని బంధించి ప్రధానయాజకులయొద్దకు కొనిపోవుటకు ఇక్కడికికూడివచ్చియున్నాడని చెప్పుకొనిరి. 
22  అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి - ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. 
23  అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతని చంపనాలోచింపగా 
24  వారి ఆలోచన సౌలుకు తెలియవచ్చెను. వారు అతని చంపవలెనని దివారాత్రులు ద్వారములయొద్ద కాచుకొనుచుండిరి 
25  గనుక అతని శిష్యులు రాత్రివేళ అతని తీసికొనిపోయి గంపలో ఉంచి గోడగుండ అతనిని క్రిందికి దింపిరి. 
26  అతడు యెరూషలేములోకి వచ్చి శిష్యులతో కలిసికొనుటకు యత్నముచేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి. 
27  అయితే బర్నబా అతనిని దగ్గరతీసి అపొస్తలులయొద్దకు తోడుకొనివచ్చి - అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాటలాడెననియు, అతడు దమస్కులో యేసు నామమునుబట్టి ధైర్యముగా బోధించెననియు, వారికి వివరముగా తెలియపరచెను. 
28-29. అతడు యెరూషలేములో వారితోకూడ వచ్చుచుపోవుచు, ప్రభువు నామమునుబట్టి ధైర్యముగా బోధించుచు, హెల్లేనిస్తులతో మాటలాడుచు తర్కించుచునుండెను. వారు అతని చంప ప్రయత్నముచేసిరి గాని 
30  సహోదరులు దీని తెలిసికొని అతని కైసరైయకు తోడుకొనివచ్చి తార్సుకు పంపిరి. 
31  కావున యూదైయ గలిలైయ సమరైయ దేశములయందంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచుసమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. 
32  ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారముచేయుచు, లుద్దలో కాపురమున్న పరిశుద్ధులయొద్దకు వచ్చెను. 
33  అక్కడ పక్షవాయువు కలిగి యెనిమిదిఏండ్లనుండి మంచము పట్టియుండిన ఐనెయా అను ఒక మనుష్యుని చూచి. 
34  పేతురు - ఐనెయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా 
35  వెంటనే అతడు లేచెను. లుద్దలోను సారోనులోను కాపురమున్నవారందరు అతని చూచి ప్రభువుతట్టు తిరిగిరి. 
36  మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను; ఆమెకు భాషాంతరమున దొర్కాఅని పేరు. ఆమె సత్ క్రియలను ధర్మకార్యములను బహుగా చేసియుండెను. 
37  ఆ దినములయందామె కాయిలాపడి చనిపోగా, వారు శవమునుకడిగి మేడగదిలో పరుండబెట్టిరి. 
38  లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుటచేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులువిని, అతడు తడవుచేయక తమయొద్దకు రావలెనని వేడుకొనుటకు ఇద్దరు మనుష్యులను అతనియొద్దకు పంపిరి. 
39  పేతురు లేచి వారితోకూడ వెళ్లి అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోకి అతని తీసికొనివచ్చిరి; విధవరాండ్లందరు వచ్చి యేడ్చుచు, దొర్కా తమతో కూడ ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములును చూపుచు తనయెదుట నిలిచిరి. 
40  పేతురు అందరిని వెలపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి శవమువైపు తిరిగి - తబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. 
41  అతడామెకు చెయ్యియిచ్చి లేవనెత్తి, పరిశుద్ధులను విధవరాండ్లను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను. 
42  ఇది యొప్పేయందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. 
43  పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారునియొద్ద బహుదినములు నివసించెను. 
Download Audio File

No comments:

Post a Comment