1-2. ఓ థెయొఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్తలులకు పరిశుద్ధాత్మద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినిగూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని.
3 ఆయన శ్రమపడిన తరువాత నలువది దినముల పర్యంతము వారికగుపడుచు, దేవుని రాజ్యవిషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములనుచూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను.
4 ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెను - మీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి;
5 యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్దిదినములలోగా మీరు పరిశుద్ధాత్మలోబాప్తిస్మముపొందెదరనెను.
6 కాబట్టి వారు కూడివచ్చినప్పుడు - ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా ఆయన
7 - కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొనియున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు.
8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదైయ సమరైయ దేశములయందంతటను భూదిగంతములవరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.
9 ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను; అప్పుడు ఒక మేఘము వచ్చి వారి కన్నులకు కనబడకుండ ఆయనను కొనిపోయెను.
10 ఆయన వెళ్లుచుండగా వారు ఆకాశమువైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని వస్త్రములు ధించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి
11 - గలిలైయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీ యొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే యే రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.
12 అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి యెరూషలేముకు తిరిగి వెళ్లిరి. ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతిదినమున నడవదగినంత సమీపమున ఉన్నది.
13 వారు (పట్టణములో) ప్రవేశించి తాము బసచేయుచుండిన మేడగదిలోకి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, మతాభిమానియను సీమోను, యాకోబు కుమారుడగుయూదా అనువారు.
14 వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును, ఏకభావముగా ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి.
15 ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరువదిమంది సహోదరులు కూడియుండగా పేతురు వారి మధ్యనిలిచి యిట్లనెను
16 - సహోదరులారా, యేసును పట్టుకొనినవారికి త్రోవ చూపిన యూదానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను.
17 అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై యీ పరిచర్యలో పాలుపొందెను.
18 ఈ యూదా ద్రోహమువలన సంపాదించిన రూకలనిచ్చి యొక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటకి వచ్చెను.
19 ఈ సంగతి యెరూషలేములో కాపురమున్నవారికందరికి తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడియున్నది; దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా
20 - అతని యిల్లు పాడైపోవుగాకదానిలో ఎవడును కాపురముండక పోవుగాకఅతని యుద్యోగము వేరొకడు తీసికొనునుగాకఅని కీర్తనల గ్రంథములో వ్రాయబడియున్నది
21-22. కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మనయొద్దనుండి పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు, ఆయన మనమధ్య సంచరించుండిన కాలమంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు, మనతోకూడ ఆయన పునరుత్థానమునుగూర్చి సాక్షియై యుండుట అవశ్యమని చెప్పెను.
23 అప్పుడు వారు యూస్తు అను మారుపేరుగల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి
24 ఇట్లని ప్రార్థనచేసిరి - అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా,
25 తనచోటికి పోవుటకు యూదాతప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనుపరచుమనిరి.
26 అంతట వారు వీరినిగూర్చి చీట్లువేయగా మత్తీయపేరట చీటివచ్చెను గనుక అతడు పదకొండుమంది అపొస్తలులతో కూడ లెక్కింపబడెను.
Download Audio File
3 ఆయన శ్రమపడిన తరువాత నలువది దినముల పర్యంతము వారికగుపడుచు, దేవుని రాజ్యవిషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములనుచూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను.
4 ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెను - మీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి;
5 యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్దిదినములలోగా మీరు పరిశుద్ధాత్మలోబాప్తిస్మముపొందెదరనెను.
6 కాబట్టి వారు కూడివచ్చినప్పుడు - ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా ఆయన
7 - కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొనియున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు.
8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదైయ సమరైయ దేశములయందంతటను భూదిగంతములవరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.
9 ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను; అప్పుడు ఒక మేఘము వచ్చి వారి కన్నులకు కనబడకుండ ఆయనను కొనిపోయెను.
10 ఆయన వెళ్లుచుండగా వారు ఆకాశమువైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని వస్త్రములు ధించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి
11 - గలిలైయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీ యొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే యే రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.
12 అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి యెరూషలేముకు తిరిగి వెళ్లిరి. ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతిదినమున నడవదగినంత సమీపమున ఉన్నది.
13 వారు (పట్టణములో) ప్రవేశించి తాము బసచేయుచుండిన మేడగదిలోకి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, మతాభిమానియను సీమోను, యాకోబు కుమారుడగుయూదా అనువారు.
14 వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును, ఏకభావముగా ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి.
15 ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరువదిమంది సహోదరులు కూడియుండగా పేతురు వారి మధ్యనిలిచి యిట్లనెను
16 - సహోదరులారా, యేసును పట్టుకొనినవారికి త్రోవ చూపిన యూదానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను.
17 అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై యీ పరిచర్యలో పాలుపొందెను.
18 ఈ యూదా ద్రోహమువలన సంపాదించిన రూకలనిచ్చి యొక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటకి వచ్చెను.
19 ఈ సంగతి యెరూషలేములో కాపురమున్నవారికందరికి తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడియున్నది; దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా
20 - అతని యిల్లు పాడైపోవుగాకదానిలో ఎవడును కాపురముండక పోవుగాకఅతని యుద్యోగము వేరొకడు తీసికొనునుగాకఅని కీర్తనల గ్రంథములో వ్రాయబడియున్నది
21-22. కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మనయొద్దనుండి పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు, ఆయన మనమధ్య సంచరించుండిన కాలమంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు, మనతోకూడ ఆయన పునరుత్థానమునుగూర్చి సాక్షియై యుండుట అవశ్యమని చెప్పెను.
23 అప్పుడు వారు యూస్తు అను మారుపేరుగల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి
24 ఇట్లని ప్రార్థనచేసిరి - అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా,
25 తనచోటికి పోవుటకు యూదాతప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనుపరచుమనిరి.
26 అంతట వారు వీరినిగూర్చి చీట్లువేయగా మత్తీయపేరట చీటివచ్చెను గనుక అతడు పదకొండుమంది అపొస్తలులతో కూడ లెక్కింపబడెను.
Download Audio File
No comments:
Post a Comment