1 అన్యజనులును దేవుని వాక్యమంగీకరించిరని అపొస్తలులును యూదైయయందంతటనున్న సహోదరులును వినిరి.
2 పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు
3 - నీవు సున్నతిపొందనివారియొద్దకు పోయి వారితోకూడ భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి.
4 అందుకు పేతురు మొదటనుండి వరుసగా వారికి సంగతి ఈలాగు వివరించి చెప్పెను
5 - నేను యొప్పేపట్టణములో ప్రార్థచేయుచుండగా పరవశుడనైతిని; అప్పుడొక దర్శనము నాకు కలిగెను; అది ఏదనగా నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్దదుప్పటివంటి యొక విధమైన పాత్ర ఆకాశమునుండి దిగి నాయొద్దకు వచ్చెను.
6 దానివైపు నేను తేరిచూచి పరీక్షింపగా భూమియందుండు చతుష్పాదజంతువులును అడవి మృగములును ప్రాకెడు పురుగులును ఆకాశపక్షులును నాకు కనబడెను.
7 అప్పుడు - పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని యొక శబ్దము నాతో చెప్పుట వింటిని.
8 అందుకు నేను - వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనదియు నా నోట ఎన్నడును పడలేదని చెప్పగా
9 రెండవమారు ఆ శబ్దము ఆకాశమునుండి - దేవుడు పవిత్రముచేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను.
10 ఈలాగు ముమ్మారు జరిగెను; తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసికొనిపొబడెను.
11 వెంటనే కైసరైయనుండి నాయొద్దకు పంపబడిన ముగ్గురు మనుష్యులు మేమున్న యింటియొద్ద నిలిచియుండిరి.
12 అప్పుడు ఆత్మ - నీవు భేదమేమియు చేయక వారితో కూడ వెళ్లుమని నాకు సెలవిచ్చెను. ఈ ఆరుగురు సహోదరులు నాతోకూడ వచ్చిరి; మేము కొర్నేలి యింట ప్రవేశించితిమి.
13 అప్పుడతడు - నీవు యొప్పేకు మనుష్యులను పంపి పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుము;
14 నీవును నీ యింటివారందరును ఏ మాటలవలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని, తన యింట నిలిచి తనతో చెప్పిన యొక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను.
15 నేను మాటలాడ నారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మనమీదికి దిగిన ప్రకారము వారి మీదికిని దిగెను.
16 అప్పుడు -యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలోబాప్తిస్మము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేనుజ్ఞాపకము చేసికొంటిని.
17 కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికికూడ సమానవరము అనుగ్రహించియుండగా దేవుని అడ్డగించుటకు నేను ఏపాటివాడనని చెప్పెను.
18 వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక - అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సుదయచేసి యున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.
19 స్తెఫను విషయములో కలిగిన శ్రమనుబట్టి చెదరిపోయినవారి యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక, ఫేనీకే, కుప్ర, అంతియొకైయ ప్రదేశములవరకు సంచరించిరి.
20 కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి, వీరు అంతియొకైయకు వచ్చి హెల్లేనీయులతో మాటలాడుచు ప్రభువైన యేసునుగూర్చిన సువార్త ప్రకటించిరి;
21 ప్రభువు హస్తము వారికి తోడైయుండెను గనుక నమ్మినవారనేకులు ప్రభువుతట్టు తిరిగిరి
22 వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపువారు విని బర్నబాను అంతియొకైయవరకు పంపిరి.
23 అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, ప్రభువును స్థిరహృదయముతో హత్తుకొనవలెనని అందరిని హెచ్చరించెను.
24 అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు; బహు జనులు ప్రభువు పక్షము చేరిరి.
25 అంతట అతడు సౌలును వెదకుటకు తార్సుకు వెళ్లి అతని కనుగొని అంతియొకైయకు తోడుకొని వచ్చెను.
26 వారు కలిసి యొక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహు జనులకు (వాక్యమును) బోధించిరి. మొట్టమొదట అంతియొకైయలో శిష్యులు క్రైస్తవులనబడిరి.
27 ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేమునుండి అంతియొకైయకు వచ్చిరి.
28 వారిలో అగబు అను ఒకడు నిలువబడి, భూలోకమంతట గొప్ప కరవు రాబోవుచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను.
29 అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తికొలది యూదైయలో కాపురమున్న సహోదరులకు సహాయార్థముగా సొమ్ముపంపుటకు నిశ్చయించుకొనెను.
30 ఆలాగున చేసి బర్నబా సౌలు అను వారిచేత పెద్దలయొద్దకు దాని పంపిరి.
Download Audio File
2 పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు
3 - నీవు సున్నతిపొందనివారియొద్దకు పోయి వారితోకూడ భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి.
4 అందుకు పేతురు మొదటనుండి వరుసగా వారికి సంగతి ఈలాగు వివరించి చెప్పెను
5 - నేను యొప్పేపట్టణములో ప్రార్థచేయుచుండగా పరవశుడనైతిని; అప్పుడొక దర్శనము నాకు కలిగెను; అది ఏదనగా నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్దదుప్పటివంటి యొక విధమైన పాత్ర ఆకాశమునుండి దిగి నాయొద్దకు వచ్చెను.
6 దానివైపు నేను తేరిచూచి పరీక్షింపగా భూమియందుండు చతుష్పాదజంతువులును అడవి మృగములును ప్రాకెడు పురుగులును ఆకాశపక్షులును నాకు కనబడెను.
7 అప్పుడు - పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని యొక శబ్దము నాతో చెప్పుట వింటిని.
8 అందుకు నేను - వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనదియు నా నోట ఎన్నడును పడలేదని చెప్పగా
9 రెండవమారు ఆ శబ్దము ఆకాశమునుండి - దేవుడు పవిత్రముచేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను.
10 ఈలాగు ముమ్మారు జరిగెను; తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసికొనిపొబడెను.
11 వెంటనే కైసరైయనుండి నాయొద్దకు పంపబడిన ముగ్గురు మనుష్యులు మేమున్న యింటియొద్ద నిలిచియుండిరి.
12 అప్పుడు ఆత్మ - నీవు భేదమేమియు చేయక వారితో కూడ వెళ్లుమని నాకు సెలవిచ్చెను. ఈ ఆరుగురు సహోదరులు నాతోకూడ వచ్చిరి; మేము కొర్నేలి యింట ప్రవేశించితిమి.
13 అప్పుడతడు - నీవు యొప్పేకు మనుష్యులను పంపి పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుము;
14 నీవును నీ యింటివారందరును ఏ మాటలవలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని, తన యింట నిలిచి తనతో చెప్పిన యొక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను.
15 నేను మాటలాడ నారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మనమీదికి దిగిన ప్రకారము వారి మీదికిని దిగెను.
16 అప్పుడు -యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలోబాప్తిస్మము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేనుజ్ఞాపకము చేసికొంటిని.
17 కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికికూడ సమానవరము అనుగ్రహించియుండగా దేవుని అడ్డగించుటకు నేను ఏపాటివాడనని చెప్పెను.
18 వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక - అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సుదయచేసి యున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.
19 స్తెఫను విషయములో కలిగిన శ్రమనుబట్టి చెదరిపోయినవారి యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక, ఫేనీకే, కుప్ర, అంతియొకైయ ప్రదేశములవరకు సంచరించిరి.
20 కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి, వీరు అంతియొకైయకు వచ్చి హెల్లేనీయులతో మాటలాడుచు ప్రభువైన యేసునుగూర్చిన సువార్త ప్రకటించిరి;
21 ప్రభువు హస్తము వారికి తోడైయుండెను గనుక నమ్మినవారనేకులు ప్రభువుతట్టు తిరిగిరి
22 వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపువారు విని బర్నబాను అంతియొకైయవరకు పంపిరి.
23 అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, ప్రభువును స్థిరహృదయముతో హత్తుకొనవలెనని అందరిని హెచ్చరించెను.
24 అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు; బహు జనులు ప్రభువు పక్షము చేరిరి.
25 అంతట అతడు సౌలును వెదకుటకు తార్సుకు వెళ్లి అతని కనుగొని అంతియొకైయకు తోడుకొని వచ్చెను.
26 వారు కలిసి యొక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహు జనులకు (వాక్యమును) బోధించిరి. మొట్టమొదట అంతియొకైయలో శిష్యులు క్రైస్తవులనబడిరి.
27 ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేమునుండి అంతియొకైయకు వచ్చిరి.
28 వారిలో అగబు అను ఒకడు నిలువబడి, భూలోకమంతట గొప్ప కరవు రాబోవుచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను.
29 అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తికొలది యూదైయలో కాపురమున్న సహోదరులకు సహాయార్థముగా సొమ్ముపంపుటకు నిశ్చయించుకొనెను.
30 ఆలాగున చేసి బర్నబా సౌలు అను వారిచేత పెద్దలయొద్దకు దాని పంపిరి.
Download Audio File
No comments:
Post a Comment